ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు అందాలి: ఈటల
ABN , First Publish Date - 2021-08-15T02:13:42+05:30 IST
హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రతి దళిత కుటుంబానికీ దళితబంధు అందించాలని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు
హుజూరాబాద్: హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రతి దళిత కుటుంబానికీ దళితబంధు అందించాలని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి దళిత కుటుంబానికీ పథకం అందాలన్నారు. పథకం కింద ఇచ్చే 10 లక్షల రూపాయలను దళితులు వారి నైపుణ్యానికి అనుగుణంగా ఖర్చుపెట్టుకునే వెసూలుబాటు కల్పించాలని సూచించారు. ప్రభుత్వం ఇచ్చే దళితబంధుపై కలెక్టర్, బ్యాంకు మేనేజర్ల ఆజమాయిషీ తీసివేయాలన్నారు. దళితబంధు అందరికీ అందించకపోతే ఉద్యమం తప్పదని ఈటల రాజేందర్ హెచ్చరించారు.