దళితుల భూమిని ఆక్రమించిన పెద్దిరెడ్డిని అరెస్టు చేయరా?

ABN , First Publish Date - 2021-05-05T06:46:41+05:30 IST

దళిత నేత నీలం నాగేంద్రరావు అనువంశికత భూమిని ఆక్రమించిన వైసీపీ నేత పెద్దిరెడ్డి సూర్యప్రకాష్‌రెడ్డిని అరెస్టు చేయకపోవడంపై మాలమహానాడు జిల్లా అధ్యక్షుడు దారా అంజయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.

దళితుల భూమిని ఆక్రమించిన పెద్దిరెడ్డిని అరెస్టు చేయరా?
తాళ్లూరులో నిరసన తెలియజేస్తున్న దళిత నేతలు

దళిత నేతల నిరసన

తాళ్లూరు, మే 4 : దళిత నేత నీలం నాగేంద్రరావు  అనువంశికత భూమిని ఆక్రమించిన వైసీపీ నేత పెద్దిరెడ్డి సూర్యప్రకాష్‌రెడ్డిని అరెస్టు చేయకపోవడంపై మాలమహానాడు జిల్లా అధ్యక్షుడు దారా అంజయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. తాళ్లూరులోని అంబేద్కర్‌, జగ్జ్గీవన్‌రావ్‌ విగ్రహాల వద్ద ఎమ్మార్పీఎస్‌, మాల మహానాడు సంయుక్తంగా నిరసన కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. మంత్రి బాలినేని సూచించినా అరెస్టు చేయకపోవడంలో మతలబు ఏంటని వారు ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్‌ నేతలు అనపర్తి ఆదాం, అనపర్తిసుబ్బారావు, కొత్త రమేష్‌, బంటుపల్లి అర్జున్‌, పులుగు చినమోషే, గోసాల హనుమంతరావు, మేకల ఆదినారాయణ, పాముల సంఘం నేత రమేష్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-05-05T06:46:41+05:30 IST