కష్టకాలంలోనూ పెరిగిన సంపద

ABN , First Publish Date - 2020-04-09T06:23:20+05:30 IST

అదృష్టం ఉంటే కష్టకాలం కూడా కొంత మందికి కలిసొస్తుంది. డీమార్ట్‌ స్టోర్ల అధినేత రాధాకృష్ణ దమానీయే ఇందుకు ఉదాహరణ. ఆర్థిక మందగమనం, కరోనా దెబ్బతో ప్రస్తుతం వ్యాపారాలన్నీ కుదేలవుతుండడంతో...

కష్టకాలంలోనూ పెరిగిన సంపద

  • డీమార్ట్‌ అధినేత దమానీ ఆస్తుల విలువ రూ.77,520 కోట్లు


న్యూఢిల్లీ : అదృష్టం ఉంటే కష్టకాలం కూడా కొంత మందికి కలిసొస్తుంది. డీమార్ట్‌ స్టోర్ల అధినేత రాధాకృష్ణ దమానీయే ఇందుకు ఉదాహరణ. ఆర్థిక మందగమనం, కరోనా దెబ్బతో ప్రస్తుతం వ్యాపారాలన్నీ కుదేలవుతుండడంతో కంపెనీల షేర్లూ కుప్పకూలుతున్నాయి. గత ఏడాది కాలంలో ముకేశ్‌ అంబానీ వంటి 11 మంది బడా పారిశ్రామిక దిగ్గజాల సంపద తరిగిపోయింది.


ఇలాంటి తరుణంలో గత ఏడాది కాలంలో దమానీ సంపద ఐదు శాతం పెరిగి 1,020 కోట్ల డాలర్లకు (సుమారు రూ.77,520 కోట్లు) చేరింది. భారత్‌లో అత్యంత సంపన్నులైన 12 మంది కుబేరుల పేర్లతో విడుదలైన బ్లూమ్‌బెర్గ్‌ బిలియనీర్స్‌ ఇండెక్స్‌ ఈ విషయం పేర్కొంది. డీమార్ట్‌ స్టోర్లను నిర్వహించే అవెన్యూ సూపర్‌మార్ట్స్‌ కంపెనీ షేర్ల ధర గత ఏడాది కాలంలో 18 శాతం పెరగడం ఇందుకు ప్రధాన కారణం. 

Updated Date - 2020-04-09T06:23:20+05:30 IST