ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

ABN , First Publish Date - 2022-01-20T02:44:26+05:30 IST

మండలంలోని పూలతోట ఆర్‌బీకేలో బుధవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సూ ళ్లూరుపేట డీసీసీబీ మేనేజర్‌ మారేళ్ల హరి

ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
పూలతోట ఆర్‌బీకేలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో నెమ్ముశాతం పరీక్షించే పరికరాన్ని పరిశీలిస్తున్న అధికారులు

దొరవారిసత్రం, జనవరి 19 :  మండలంలోని పూలతోట ఆర్‌బీకేలో బుధవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సూ ళ్లూరుపేట డీసీసీబీ మేనేజర్‌ మారేళ్ల  హరి ప్రారం భించారు. ఈ కేంద్రంలో ఎన్‌ఎల్‌ఆర్‌ 34449, బీపీటీ 5204, ఆర్‌ఎన్‌ఆర్‌ 15048, కేఎన్‌ఎం 1638 రకాలను కొనుగోలు చేస్తామని ఆయన తెలిపారు. నెమ్ము 17 శాతం ఉండేలా రైతులు ధాన్యాన్ని ఆరబెట్టుకోవాలని తెలిపారు. ఈ కార్యక్ర మంలో సూళ్లూరుపేట డీసీసీబీ అసిస్టెంట్‌ మేనేజర్‌ రెడ్డి సుధాకర్‌, నెలబల్లి పీఏసీఎస్‌ సీఈవో గఫూర్‌, పూలతో ట ఆర్‌బీకే వీఏఏ రచన, రైతులు పాల్గొన్నారు.   


Updated Date - 2022-01-20T02:44:26+05:30 IST