అగ్నిప్రమాదంలో ధాన్యం దగ్ధం

ABN , First Publish Date - 2021-06-18T03:35:13+05:30 IST

మండలంలోని పారిచెర్లవారిపాళెంలో గురువారం జరిగిన అగ్నిప్రమాదంలో ధాన్యం దగ్ధమైంది. స్థానికుల క

అగ్నిప్రమాదంలో ధాన్యం దగ్ధం
మంటలను అదుపు చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది

చిల్లకూరు, జూన్‌ 17: మండలంలోని పారిచెర్లవారిపాళెంలో గురువారం జరిగిన అగ్నిప్రమాదంలో ధాన్యం దగ్ధమైంది. స్థానికుల కథనం మేరకు... గ్రామానికి చెందిన ముగ్గురు రైతులు గ్రామానికి సమీపంలోని ఖాళీప్రదేశంలో ధాన్యం నిల్వచేసుకుని ఉన్నారు. ఈ క్రమంలో రైతులు ధాన్యం నిల్వచేసుకున్న ప్రదేశానికి సమీపంలోని జామాయిల్‌తోటలో గుర్తుతెలియని వ్యక్తులు సిగరెట్‌పీకను విసరడంతో తోటలో ఎండిన ఆకులు కాలి ధాన్యానికి నిప్పంటుకుంది. దీంతో శంకర్‌రెడ్డి 14 పుట్లు ధాన్యం నిల్వచేయగా 3పుట్లు, వేదవతమ్మ 15పుట్లు నిల్వచేయగా 4పుట్లు, వేణుగోపాల్‌రెడ్డి 17పుట్లు నిల్వచేయగా 6పుట్లు ధాన్యం కాలిపోయింది. దీంతో అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపుచేయడంతో కొంతమేర ధాన్యం మిగిలిందని రైతులు తెలిపారు.  దీంతో ఒక్కొక్కరు సుమారు రూ. 60వేలు నుంచి 80వేలు వరకు నష్టపోయినట్లు బాధిత రైతులు తెలిపారు. 



---------------


Updated Date - 2021-06-18T03:35:13+05:30 IST