మరోసారి ఎన్ఐఏ కస్టడీలోకి దర్భంగా కేసు నిందితులు
ABN , First Publish Date - 2021-07-13T14:32:21+05:30 IST
దర్భంగా కేసులో ఎన్ఐఏ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో నిందితులను ఎన్ఐఏ అధికారుల మరోసారి కస్టడీలోకి తీసుకున్నారు.
హైదరాబాద్: దర్భంగా కేసులో ఎన్ఐఏ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో నిందితులను ఎన్ఐఏ అధికారులు మరోసారి కస్టడీలోకి తీసుకున్నారు. ఇప్పటికే వారం పాటు కస్టడీలోకి తీసుకుని నిందితులను ఎన్ఐఏ ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఈనెల 16 వరకు నలుగురు నిందితుల కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో వారిని బీహార్ నుంచి ఢిల్లీకి తరలించారు. మాలిక్ సోదరులతో పాటు ఖాఫిల్, హాజీసలీంలను ఎన్ఐఏ అధికారులు ప్రశ్నించినున్నారు. అనారోగ్యం దృష్ట్యా ఇప్పటి వరకు హాజీ సలీంను ఎన్ఐఏ ప్రశ్నించలేదు.