చీకటి జీవోలను రద్దు చేయాలి
ABN , First Publish Date - 2022-01-19T07:05:43+05:30 IST
ఉద్యోగులకు ఏమాత్రం సమ్మతం లేని చీకటి జీవో లను వెంటనే రద్దు చేయాలని, అశుతోష్ మిశ్రా రిపోర్ట్ ప్రకారం పీఅర్సీ అ మలు చేయాలని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు
ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో నిరసనలు
కదిరి, జనవరి 18: ఉద్యోగులకు ఏమాత్రం సమ్మతం లేని చీకటి జీవో లను వెంటనే రద్దు చేయాలని, అశుతోష్ మిశ్రా రిపోర్ట్ ప్రకారం పీఅర్సీ అ మలు చేయాలని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక అర్అండ్ బీ బంగ్లా నుంచి ర్యాలీగా వెళ్లి అంబేడ్కర్ సర్కిల్లో మానవహారం ఏర్పాటు చేశారు. అనంతరం జీవో కాపీ లను తగులపెట్టారు. ర్యాలీ పెద్ద ఎత్తున ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంటనే ఉద్యోగులతో చర్చలు జరిపి అందరికి అమో దయోగ్యమైన పీఅర్సీని ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో ఏపీటిఫ్ నాయకులు త్రిమూర్తి, బండారు గంగాధర్, అదిబయన్న, నారా యణ, రాజశేఖర్, ఎస్టీయు నుంచి రామమోహన్,యుటీఎఫ్ నుంచి శ్రీనివా సులు, తాహెర్, టీఎన్యుస్ నుంచి చింతా శ్రీనివాసులు, ఎన్జీవో ప్రసిడెంట్ వేణుగోపాల్రెడ్డి, పెన్షనర్ సంఘం నాయకులు ఆత్మరెడ్డి, వైఎస్అర్టీఎఫ్ నుంచి జంషీద్, శివయ్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.