AP: దర్శి మాజీ ఎమ్మెల్యే సానికొమ్ము పిచ్చిరెడ్డి కన్నుమూత
ABN , First Publish Date - 2021-10-14T13:25:00+05:30 IST
ప్రకాశం జిల్లా దర్శి మాజీ ఎమ్మెల్యే సానికొమ్ము పిచ్చిరెడ్డి కన్నుమూశారు.
ఒంగోలు: ప్రకాశం జిల్లా దర్శి మాజీ ఎమ్మెల్యే సానికొమ్ము పిచ్చిరెడ్డి కన్నుమూశారు. గత కొద్దికాలంగా అనారోగ్యంతో ఒంగోలులో చికిత్స పొందుతూ గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. 1989, 1999లలో రెండుసార్లు దర్శి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా పిచ్చిరెడ్డి గెలుపొందారు. పిచ్చిరెడ్డి మృతి పట్ల పలువురు నేతలు సంతాపం తెలిపారు.