వివేకా కేసులో దస్తగిరి అప్రూవల్ పిటీషన్ డిస్మిస్
ABN , First Publish Date - 2021-11-12T02:43:12+05:30 IST
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవల్గా మారతానని వివేకా మాజీ డ్రైవర్ షేక్ దస్తగిరి దాఖలు చేసిన అప్రూవల్ పిటిషన్ను గురువారం కడప
కడప: మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవల్గా మారతానని వివేకా మాజీ డ్రైవర్ షేక్ దస్తగిరి దాఖలు చేసిన అప్రూవల్ పిటిషన్ను గురువారం కడప సబ్ కోర్టు డిస్మిస్ చేసింది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి దస్తగిరి న్యాయమూర్తి ఎదుట హాజరై 164 వాంగ్మూలం ఇచ్చినట్లు తెలిసిందే. వాంగ్మూలంలో ఇచ్చిన విషయాలు బహిర్గతం చేయకుండా అప్రూవల్గా మారతానని దస్తగిరి వేసిన పిటీషన్ను న్యాయమూర్తి నిరాకరించినట్లు న్యాయవాదులు పేర్కొన్నారు. ఈ కేసులో ఎర్రగంగిరెడ్డి, సునీల్యాదవ్, గజ్జల ఉమాశంకర్రెడ్డి, షేక్ దస్తగిరి పాత్ర ఉందని పులివెందుల కోర్టులో అక్టోబరు 27న సీబీఐ ప్రాథమిక అభియోగ పత్రం (చార్జిషీటు) దాఖలు చేసిన సంగతి తెలిసిందే.