డేటాను థర్డ్‌ పార్టీకి ఇవ్వొచ్చు: గూగుల్‌

ABN , First Publish Date - 2020-09-25T08:11:12+05:30 IST

ముందస్తు అనుమతితో కస్టమర్ల లావాదేవీల డేటాను థర్డ్‌ పార్టీలతో పంచుకోవడానికి అనుమతి ఉందని ఢిల్లీ హైకోర్టుకు గూగుల్‌పే (జీపే) యాప్‌ను నిర్వహిస్తున్న గూగుల్‌ ఇండియా డిజిటల్‌ సర్వీసెస్‌ తెలియజేసింది...

డేటాను థర్డ్‌ పార్టీకి ఇవ్వొచ్చు: గూగుల్‌

న్యూఢిల్లీ, సెప్టెంబరు 24: నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ)తోపాటు పేమెంట్‌ సర్వీస్‌ ప్రొవైడింగ్‌ బ్యాంకుల నుంచి ముందస్తు అనుమతితో కస్టమర్ల లావాదేవీల డేటాను థర్డ్‌ పార్టీలతో పంచుకోవడానికి అనుమతి ఉందని ఢిల్లీ హైకోర్టుకు గూగుల్‌పే (జీపే) యాప్‌ను నిర్వహిస్తున్న గూగుల్‌ ఇండియా డిజిటల్‌ సర్వీసెస్‌ తెలియజేసింది. డేటా స్థానికీకరణ, నిల్వ, షేరింగ్‌కు సంబంధించి ఆర్బీఐ మార్గదర్శకాలను జీపే ఉల్లంఘిస్తోందని ఆరోపిస్తూ.. తగిన చర్యలు తీసుకోవాలని దాఖలైన ఓ ప్రజాప్రయోజన వ్యాజ్యానికి స్పందనగా చీఫ్‌ జస్టిస్‌ డీఎన్‌ పటేల్‌, జస్టిస్‌ ప్రతీక్‌ జలాన్‌లతో కూడిన ధర్మాసనానికి గూగుల్‌ తన అఫిడవిట్‌ను సమర్పించింది.

Updated Date - 2020-09-25T08:11:12+05:30 IST