తెలంగాణలో ఎంసెట్ దరఖాస్తు గడువు పెంపు

ABN , First Publish Date - 2021-06-17T22:33:56+05:30 IST

తెలంగాణలో ఎంసెట్ దరఖాస్తు గడువు పెంపు

తెలంగాణలో ఎంసెట్ దరఖాస్తు గడువు పెంపు

హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్ దరఖాస్తు గడువు పెంచినట్లు ఎంసెట్ కన్వీనర్ గోవర్ధన్ తెలిపారు. జూన్ 24 వరకు గడువు పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. ఇప్పటి వరకు ఇంజనీరింగ్ కోసం 2 లక్షల 25 వేల 125 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని వెల్లడించారు. అగ్రికల్చర్ బీఎస్సీ కోసం 75 వేల 519 మంది  దరఖాస్తు చేసుకున్నారని గోవర్ధన్ పేర్కొన్నారు. కరోనా నేపథ్యంలో ఇప్పటికే ఓసారి గడువు పెంచారు. తాజాగా మరోసారి గడువు పెంచడంతో మరింత మంది విద్యార్థులు దరఖాస్తు చేసే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. 


మరోవైపు తెలంగాణ విద్యాశాఖ సెట్ పరీక్షలు నిర్వహించేందుకు నివేదిక తయారు చేసింది. ఈ నివేదికను ఇప్పటికే ప్రభుత్వానికి అందజేసింది. ప్రభుత్వ ఆమోదం కోసం ఎదురు చూస్తోంది. ఈ సందర్భంగా  విద్యా మండలి చైర్మన్ టి పాపిరెడ్డి మాట్లాడుతూ జూలై 5 నుండి 9 వరకు జరగాల్సిన మూడు ఎంట్రెన్స్ టెస్ట్‌లను రీషెడ్యూల్ చేసినట్లు తెలిపారు. మొత్తం ఏడు సెట్స్‌లో 3 సెట్స్ తేదీల్లో మార్పు, మిగిలిన నాలుగు సెట్స్ పరీక్షలు యధాతధంగా ఉండే అవకాశం ఉందన్నారు. ఆగస్టు చివరి వారంలో ఫలితాలు ప్రకటిస్తామని చెప్పారు. సెప్టెంబర్ 15 నాటికి అడ్మిషన్స్ పూర్తిగా చేపట్టాలనే యోచనలో ఉన్నట్లు పేర్కొన్నారు. సెట్స్‌తో పాటు డిగ్రీ పీజీ పరీక్షల నిర్వహణ తేదీల్లో కూడా మార్పు ఉంటుందన్నారు. డిగ్రీ, పీజీ పరీక్షల నిర్వహణకు కామన్ పాలసీని అమల్లోకి తెస్తామని చెప్పారు. ప్రస్తుతం ఆన్‌లైన్‌లోనే తరగతులు నిర్వహిస్తున్నట్లు పాపిరెడ్డి పేర్కొన్నారు. 

Updated Date - 2021-06-17T22:33:56+05:30 IST