17న దత్తన్న అలయ్ బలయ్
ABN , First Publish Date - 2021-10-15T06:29:49+05:30 IST
దసరా సందర్భంగా ఈనెల 17న జలవిహార్లో అలయ్ బలయ్ నిర్వహిస్తున్నట్లు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె, దత్తన్న అలయ్ బలయ్ నిర్వహణ కమిటీ చైర్పర్సన్ బండారు విజయలక్ష్మి తెలిపారు.
ఉపరాష్ట్రపతి, గవర్నర్లు, సీఎంల రాక
హైదరాబాద్, అక్టోబరు 14(ఆంధ్రజ్యోతి): దసరా సందర్భంగా ఈనెల 17న జలవిహార్లో అలయ్ బలయ్ నిర్వహిస్తున్నట్లు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె, దత్తన్న అలయ్ బలయ్ నిర్వహణ కమిటీ చైర్పర్సన్ బండారు విజయలక్ష్మి తెలిపారు. గురువారం ఆమె ఇక్కడ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారని చెప్పారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్, ఏపీ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ రాజేంద్రవిశ్వనాథ్, కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖా మంత్రి జి.కిషన్రెడ్డి, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రే య, సీఎం మనోహర్లాల్ ఖట్టర్తో పాటు పలువురు ప్రముఖులు హాజరవుతున్నట్లు వివరించారు. తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్లను కూడా ఆహ్వానించినట్లు చెప్పారు. కొవిడ్-19 నిబంధనలకు అనుగుణంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన ప్ర ముఖులను సన్మానిస్తామని తెలిపారు. తెలంగాణ సంప్రదాయ వంటలతో విందు ఏర్పాటుచేయనున్నట్లు పేర్కొన్నారు.