ఆక్సిజ‌న్ సంక్షోభం: ఆసుప‌త్రి కోసం కుమార్తె వెదుకులాట‌... అంబులెన్స్‌లోనే తండ్రి క‌న్నుమూత‌!

ABN , First Publish Date - 2021-05-06T16:33:08+05:30 IST

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ల‌క్నోలో ఎన్ఆర్ఐ, రాజాజీపురం నివాసి...

ఆక్సిజ‌న్ సంక్షోభం: ఆసుప‌త్రి కోసం కుమార్తె వెదుకులాట‌... అంబులెన్స్‌లోనే తండ్రి క‌న్నుమూత‌!

ల‌క్నో: ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ల‌క్నోలో ఎన్ఆర్ఐ, రాజాజీపురం నివాసి అమితా శ్రీవాస్త‌వ్ తండ్రి అయోధ్య ప్రసాద్ శ్రీవాస్తవ(80)కి జ్వరం రావడంతో పాటు ఆక్సిజన్ లెవెల్స్ త‌గ్గిపోయాయి. దీంతో ఆమె తండ్రిని తీసుకుని అంబులెన్స్‌లో రాత్రంతా ప‌లు ఆసుప్ర‌తుల చుట్టూ తిరిగారు. అయినప్పటికీ ఆక్సిజ‌న్ బెడ్ ల‌భ్యం కాలేదు. తెల్లారేస‌రికి ఆ వృద్ధుడు మృతి చెందారు.  


అమితా శ్రీవాస్తవ అమెరికాలో ఉంటున్నారు. గత నెలలో ఆమె యుఎస్ నుంచి ఇండియాకు వ‌చ్చారు. ఇంతలో ఆమె తండ్రి అయోధ్య ప్రసాద్ శ్రీవాస్తవ, సోదరులు నవీన్‌, హ్యాపీ శ్రీవాస్తవ క‌రోనా బారిన ప‌డ్డారు. అయితే ఆమె తండ్రి  ఆరోగ్యం మ‌రింత క్షీణించింది. దీంతో ఆమె త‌న తండ్రిని తీసుకుని లక్నోలోని అన్ని ఆసుపత్రుల చుట్టూ తిరిగారు. అయితే ఎక్క‌డా ఆక్సిజ‌న్ బెడ్ ల‌భ్యం కాలేదు. అయితే ఆమె ఏదో ఒకవిధంగా 45 వేల రూపాయలు ఖ‌ర్చుచేసి, ఆక్సిజన్ సిలిండర్ కొనుగోలు చేశారు. అయితే ఇంత‌లోనే తండ్రి మృతి చెందారు. దీంతో వారి కుటుంబ‌మంతా షాక్‌న‌కు గుర‌య్యింది. 

Updated Date - 2021-05-06T16:33:08+05:30 IST