మనమరాళ్లను చంపుతానన్నాడని అల్లుడి హత్య

ABN , First Publish Date - 2020-08-11T14:43:34+05:30 IST

మనమరాళ్లను చంపుతానన్నాడని అల్లుడి హత్య

మనమరాళ్లను చంపుతానన్నాడని అల్లుడి హత్య

డి.జగన్నాథపురం కేసు వివరాలు వెల్లడించిన డీఎస్పీ   

తూర్పుగోదావరి/అన్నవరం: మనమరాళ్లను చంపుతానని బెదిరించడం వల్లనే రౌతులపూడి మండలం డి.జగన్నాథపురానికి చెందిన సత్యనారాయణ తన అల్లుడిని చంపేశాడని పెద్దాపురం డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. అన్నవరం పోలీసుస్టేషన్‌లో  ఆయన వివరాలు వెల్లడించారు. 2015 సంవత్సరంలో  శంఖవరం మండలం అచ్చింపేటకు చెందిన లచ్చబాబుతో సత్యనారాయణ కుమార్తె వివాహం జరిగింది. వారికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పది నెలల క్రితం సత్యనారాయణ కుమార్తె ఉరివేసుకుని చనిపోయింది. దీంతో మనమరాళ్లను తనతో తీసుకువచ్చి పెంచుతున్నాడు. అయితే తన కుమార్తెను అల్లుడే చంపి ఉంటాడని సత్య నారా యణకు అనుమానం ఉండేది.    ఈ క్రమంలో బట్టలు పెట్టాలని చెప్పి అల్లుడు లచ్చి బాబును ఆదివారం ఇంటికి రమ్మన్నాడు. దీంతో లచ్చిబాబు ఇంటికి వచ్చాడు. పిల్లలను ఎందుకు తీసుకెళ్లడం లేదని సత్యనారాయణ ప్రశ్నించాడు. రెండో పెళ్లి చేస్తేనే పిల్లలను తీసుకెళతానని లచ్చిబాబు చెప్పాడు. దీంతో వారిద్దరి మధ్య వాగ్వా దం జరిగింది.  రెండో పెళ్లి చేయకపోతే పిల్లలిద్దరిని చంపేస్తానని అల్లుడు బెది రించడంతో ఆగ్రహంతో ఊగిపోయిన సత్యనారాయణ లచ్చిబాబు తలనరికి పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి లొంగిపోయాడని డీఎస్పీ తెలిపారు. నిందితుడిని రిమాండ్‌కు పంపించి మృతదేహాన్ని ప్రత్తిపాడు సీహెచ్‌సీకి పంపినట్లు తెలిపారు. సమావేశంలో సీఐ రాంబాబు, ఎస్‌ఐ శంకర్‌, సిబ్బంది జయరామ్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-08-11T14:43:34+05:30 IST