Davos కోసం లండన్ దాకా వెళ్లాల్సిన అవసరం లేదు: దేవినేని ఉమ
ABN , First Publish Date - 2022-05-21T22:58:04+05:30 IST
దావోస్ వెళ్లాల్సిన సీఎం జగన్ లండన్లో ఎందుకు దిగారని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ అనంతబాబును ఎందుకు అరెస్ట్ చేయడం లేదు
అమరావతి: దావోస్ (Davos) కోసం లండన్ (London) దాకా వెళ్లాల్సిన అవసరం లేదని టీడీపీ నేత దేవినేని ఉమ (Devineni Uma) తప్పుబట్టారు. దావోస్ వెళ్లాల్సిన సీఎం జగన్ లండన్లో ఎందుకు దిగారని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ అనంతబాబును ఎందుకు అరెస్ట్ చేయడం లేదు? అని ప్రశ్నించారు. సీఎం అసమర్థత వల్లే పోలవరంపై సంబంధం లేని వ్యక్తి నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు. పోలవరం ఎత్తు తగ్గిస్తారని పక్క రాష్ట్ర సీఎం అన్నప్పుడు.. జగన్ ఎందుకు నోరు మెదపలేదు? అని ప్రశ్నించారు. తప్పుడు పత్రాలతో రూ.కోట్లు చేతులు మారినట్లు కథనాలు వచ్చాయని తెలిపారు. వైసీపీ నేతలు నిర్వాసితుల సొమ్ము పందికొక్కుల్లా మింగుతున్నారని దుయ్యబట్టారు. అనంతబాబు, పోలవరంపై ప్రజలకు జగన్ సమాధానం చెప్పాలని దేవినేని ఉమ డిమాండ్ చేశారు.