ఘనంగా దీన్‌ దయాళ్‌ జయంతి

ABN , First Publish Date - 2020-09-26T09:12:47+05:30 IST

బీజేపీ కార్యాలయంలో శుక్రవారం దీన్‌ దయాళ్‌ ఉపాధ్యాయ జయంతి ఘనంగా నిర్వహించారు

ఘనంగా దీన్‌ దయాళ్‌ జయంతి

ప్రత్తిపాడు, సెప్టెంబరు 25: బీజేపీ కార్యాలయంలో శుక్రవారం దీన్‌ దయాళ్‌ ఉపాధ్యాయ జయంతి ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సింగిల్‌దేవి సత్తిరాజు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మదినే బాబ్జి, గున్నాబత్తుల రాజబాబు, దేవర రామకృష్ణయాదవ్‌ పాల్గొన్నారు.


పిఠాపురం: పట్టణంలోని మంగాయామ్మరావుపేటలో  పండిట్‌ దీన్‌ దయాళ్‌ ఉపాధ్యాయ చిత్రపటానికి బీజేపీ పట్టణాధ్యక్షుడు పసుపులేటి సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు అల్లుబోయిన సూరిబాబు, కార్యదర్శి కర్నీడి తాతీలు, యువమోర్చా అధ్యక్షుడు గరగ వీరబాబు తది తరులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.


తుని: బీజేపీ పట్టణ కార్యాలయంలో దీన్‌ దయాళ్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాలర్పించారు. కార్యక్రమంలో నియోజకవర్గ కోఆర్డినేటర్‌ ఈశ్వరరావు, ప్రగడ చక్రరావు, ప్రగడ ఈశ్వరరావు, ఆకెళ్ల శాస్ర్తీ, నారాయణాచార్యులు తదితరులు పాల్గొన్నారు.


కిర్లంపూడి: కృష్ణవరంలో బీజేపీ మండలాధ్యక్షుడు యడాలి రాంబాబు ఆధ్వర్యంలో డీడీ ఇండస్ట్రీ అధినేత్రి ఎం.గాయత్రి శ్రీధర్‌ పండిత్‌ దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బీజేపీ నాయకులు సింగిలిదేవి, సత్తిరాజు పాల్గొన్నారు. 

Updated Date - 2020-09-26T09:12:47+05:30 IST