సౌదీ నుంచి కూచన్‌పెల్లికి చేరుకున్న మృతదేహం

ABN , First Publish Date - 2020-12-01T06:18:20+05:30 IST

మండలంలోని కూచన్‌పెల్లి గ్రామానికి చెందిన కడుదురం పోశెట్టి మృతదేహం సౌదీ దేశం నుండి స్వగ్రామానికి సోమవారం చేరుకుంది.

సౌదీ నుంచి కూచన్‌పెల్లికి చేరుకున్న మృతదేహం
సౌదీలో మృతి చెందిన పోశెట్టి మృతదేహం

సోన్‌, నవంబరు 30 : మండలంలోని కూచన్‌పెల్లి గ్రామానికి చెందిన కడుదురం పోశెట్టి మృతదేహం సౌదీ దేశం నుండి స్వగ్రామానికి సోమవారం చేరుకుంది. ఉపాధి కోసం పోశెట్టి సౌదీదేశంకు వెళ్లాడు. గత నెల రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. సౌదీలో అన్ని నింబంధనలు పూర్తి చేసి మృతదేహాన్ని ఇంటికి చేర్చే సరికి నెలరోజుల సమయం పట్టింది. మృతదేహం చెడిపోకుండా అన్ని జాగ్రతలు చేపట్టి ప్రవాసులు ఇంటికి చేర్చారు.  పోశెట్టి గల్ఫ్‌ ఎన్నో ఆశలతో గల్ఫ్‌ వెళ్లాడు. ఇప్ప టికీ  చేసిన అప్పులు తీరలేదు.  ఆయనకు పెండ్లికి వచ్చి న కూతుళ్లు ఉన్నారు. ఇంటికి పెద్ద దిక్కును కోల్పోయిన ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. 

Updated Date - 2020-12-01T06:18:20+05:30 IST