నీటిలో ఇరుక్కుపోయిన మృతదేహం

ABN , First Publish Date - 2022-01-17T05:08:54+05:30 IST

గిడిగి జలపాతంలో పడి గల్లంతైన బెంగళూరు యువకుడు అభిలాష్‌ (23) నీటిలో శవమయ్యాడు.

నీటిలో ఇరుక్కుపోయిన మృతదేహం
అభిలాష్‌ (ఫైల్‌ఫొటో)

రెండో రోజు బయటకు తీసిన పోలీసులు


వి.కోట, జనవరి 16: గిడిగి జలపాతంలో పడి గల్లంతైన బెంగళూరు యువకుడు అభిలాష్‌ (23) నీటిలో శవమయ్యాడు. బెంగళూరు నుంచి సరదాగా గడిపేందుకు వచ్చిన నలుగురు యువకులు నీటిలో ఆటలాడుతుండగా ఒకరు నీటి సుడుల్లో ఇరుక్కొని గల్లంతయ్యాడు. రెండవ రోజు గజ ఈతగాళ్ళ సాయంతో కనిపెట్టి బయటకు తీశారు. మృతుడు తమ బిడ్డేనని తల్లిదండ్రులు అతని శవాన్ని గుర్తించారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని వారి బంధువులకు అప్పగించారు. ప్రమాదకరంగా ఉన్న గిడిగి జలపాతం వద్దకు ఎవ్వరూ వెళ్ళరాదని సీఐ ప్రసాద్‌బాబు, ఎస్‌ఐ రాంభూపాల్‌ హెచ్చరించారు. 

Updated Date - 2022-01-17T05:08:54+05:30 IST