రైలు పట్టాలపై మృతదేహం
ABN , First Publish Date - 2021-08-03T03:47:41+05:30 IST
నాయుడుపేట రైల్వేస్టేషన్ సమీపంలో సోమవారం ఉదయం రైలు పట్టాలపై ఓ మృతదేహాన్ని రైల్వే పోలీసులు గుర్తించారు.
తిరుపతి వాసిగా గుర్తింపు
నాయుడుపేటటౌన్, ఆగస్టు 2 : నాయుడుపేట రైల్వేస్టేషన్ సమీపంలో సోమవారం ఉదయం రైలు పట్టాలపై ఓ మృతదేహాన్ని రైల్వే పోలీసులు గుర్తించారు. వారి వివరాల మేరకు.. తిరుపతికి చెందిన జయచంద్రారెడ్డి( 56) చెన్నైలోని ఓ ప్రైవేటు సంస్థలో విధులు నిర్వర్తిస్తున్నాడు. కొంత కాలంగా ఆరోగ్యం సరిలేక ఇబ్బందులు పడుతున్నాడు. ఈ క్రమంలో రైలు పట్టాలపై అతడి మృతదేహాన్ని గుర్తించారు. మృతుడి వద్ద లభించిన ఆధారాల మేరకు వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి మృతదేహాన్ని తరలించి రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని రైల్వే ఎస్ఐ కృష్ణయ్య తెలిపారు. ప్రమాదవశాత్తు మరణించాడా, ఆత్మహత్య చేసుకుని మృతిచెందాడా అనేది దర్యాప్తులో తేలనుందని తెలిపారు.