గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
ABN , First Publish Date - 2021-03-03T06:40:17+05:30 IST
గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
బోయిన్పల్లి, మార్చి 2 (ఆంధ్రజ్యోతి): గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం తెల్లవారు జామున గస్తీ నిర్వహిస్తున్న పోలీసులకు బోయిన్పల్లి శ్రీలత గార్డెన్ పక్కన పెట్రోల్ బంకు వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం ఉన్నట్లు సమాచారం అందింది. ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. మృతుడి వయస్సు 45-50 సంవత్సరాలు ఉంటాయని, అతడి సంబంధీకులు ఎవరైనా ఉంటే బోయిన్పల్లి పోలీ్సస్టేషన్లో సంప్రదించాలని కోరారు.