ఆహారంలో పాము.. 52 మంది విద్యార్థులకు అస్వస్థత

ABN , First Publish Date - 2021-11-20T00:47:04+05:30 IST

కలుషిత ఆహారం తిన్న 52 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన కర్ణాటకలోని యాద్గిర్

ఆహారంలో పాము.. 52 మంది విద్యార్థులకు అస్వస్థత

యాద్గిర్: కలుషిత ఆహారం తిన్న 52 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన కర్ణాటకలోని యాద్గిర్ జిల్లాలో జరిగింది. నగరంలోని అబ్బే టుముకూర్ విశ్వారాధ్య విద్యావర్ధక్ రెసిడెన్షియల్ పాఠశాలలో ఉదయం అల్పాహారం తీసుకున్న వెంటనే ముగ్గురు విద్యార్థులు వాంతులు చేసుకున్నారు. మరో 49 మంది అస్వస్థతకు గురయ్యారు.


దీంతో విద్యార్థులు తీసుకున్న ఆహారాన్ని పరిశీలించగా చనిపోయిన పాము కనిపించింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు వారికి తొలుత ముద్నాల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రథమ చికిత్స అందించారు. అనంతరం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో ముగ్గురు ఐసీయూలో చికిత్స పొందుతున్నట్టు అధికారులు తెలిపారు. విద్యార్థులందరూ ప్రమాదం నుంచి బయపడినట్టేనని వైద్యులు తెలిపారు.  

Updated Date - 2021-11-20T00:47:04+05:30 IST