చేపలవేటకు వెళ్లి వ్యక్తి మృతి
ABN , First Publish Date - 2021-06-08T04:42:08+05:30 IST
మండల పరిధిలోని పెద్దగోపతి గ్రామానికి చెందిన రాయల ఏసు(50) గ్రామ సమీపంలోని చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లి ప్రమాదశాత్తు మృతిచెందిన ఘటన సోమవారం సాయంత్రం జరిగింది.
కొణిజర్ల, జూన్ 7: మండల పరిధిలోని పెద్దగోపతి గ్రామానికి చెందిన రాయల ఏసు(50) గ్రామ సమీపంలోని చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లి ప్రమాదశాత్తు మృతిచెందిన ఘటన సోమవారం సాయంత్రం జరిగింది. ఎస్ఐ రవి తెలిపిన వివరాల ప్రకారం ఏసు చేపలు పట్టేందుకు చెరువులోకి దిగి ఊపిరిఆడక మృతిచెందాడని తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్త్నుట్టు ఎస్ఐ తెలిపారు.