సగర సేవా సంఘ గౌరవాధ్యక్షుడి మృతి

ABN , First Publish Date - 2021-05-11T05:08:19+05:30 IST

బనగానపల్లె నియోజకవర్గ సగర సేవా సంఘ గౌరవాధ్యక్షుడు, అవుకు మండలం వేములపాడు గ్రామానికి చెందిన వేల్పుల సుబ్రహ్మణ్యం గుండెపోటుతో మృతి చెందాడు.

సగర సేవా సంఘ గౌరవాధ్యక్షుడి  మృతి


బనగానపల్లె, మే 10:
  బనగానపల్లె నియోజకవర్గ సగర సేవా సంఘ గౌరవాధ్యక్షుడు, అవుకు మండలం వేములపాడు గ్రామానికి చెందిన వేల్పుల సుబ్రహ్మణ్యం గుండెపోటుతో మృతి చెందాడు. ఆయన మృతికి సగర సేవా సంఘ నియోజకవర్గ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, జిల్లా ఉపాధ్యక్షుడు సుబ్బారావు, గౌరవాధ్యక్షుడు సుబ్బారావు, చిందుకూరి సుబ్రమణ్యం, ప్రధాన కార్యదర్శి చెన్నయ్య, కార్యదర్శి శ్రీరాములు  సోమవారం సంతాపం వ్యక్తం చేశారు.  
 


బనగానపల్లె నియోజకవర్గ సగర సేవా సంఘ గౌరవాధ్యక్షుడు వేల్పుల సుబ్రహ్మణ్యం (60) మృతికి  మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి సోమవారం సంతాపం వ్యక్తం చేశారు. సుబ్రహ్మణ్యం మృతి తనను కలిచి వేసిందన్నారు. వారి కుటుంబ సభ్యులకు సంతాపం వ్యక్తం చేశారు.

Updated Date - 2021-05-11T05:08:19+05:30 IST