చనిపోయాడనుకున్న వ్యక్తి... 3 నెలల తరువాత తిరిగొచ్చాడు!
ABN , First Publish Date - 2021-03-30T17:54:16+05:30 IST
చనిపోయాడనుకున్న ఒక వ్యక్తికి అతని...
పతనంతిట్ట: చనిపోయాడనుకున్న ఒక వ్యక్తికి అతని కుటుంబీకులు అంత్యక్రియలు నిర్వహించారు. అయితే ఊహించని విధంగా మూడు నెలల తరువాత ఆ వ్యక్తి కుటుంబీకుల ముందు ప్రత్యక్షమయ్యాడు. ఈ ఉదంతం కేరళలోని పతనంతిట్ట పరిధిలోని కుదస్సనాడులో చోటుచేసుకుంది. తిరువనంతపురంలో సాబూ చిన్నాచితకా పనులు చేసేవాడు. ఒక హోటల్లో పనిచేస్తున్న సాబూను చోరీ కేసులో పోలీసులు గత ఏడాది నవంబరులో అరెస్టు చేశారు. ఈ విషయం అతని కుటుంబ సభ్యులకు తెలియదు. ఇదిలావుండగా 2021, డిసెంబర్ 24న కొట్టాయం జిల్లాలోని పాలాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు.
అయితే ఆ మృతదేహం సాబూదేనన్న అనుమానంతో కుటుంబ సభ్యులకు తిరువనంతపురం పోలీసులు తెలిపారు. దీంతో ఆ మృత దేహానికి సాబూ కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. ఇది జరిగిన మూడు నెలల తరువాత ఒక బస్ డ్రైవర్కు సాబూ ఎదురయ్యాడు. దీంతో ఈ విషయాన్ని అతను పోలీసులకు, కుటుంబ సభ్యులకు తెలిపాడు. దీంతో సాబూ కుటుంబ సభ్యులు అతనిని ఇంటికి తీసుకువచ్చారు. కాగా సాబూ కుటుంబ సభ్యులు గతంలో అంత్యక్రియలు నిర్వహించిన మృతదేహం ఎవరిదనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.