వెస్ట్ బ్యాంక్లో పదికి చేరిన మృతుల సంఖ్య
ABN , First Publish Date - 2021-05-15T07:22:19+05:30 IST
వెస్ట్ బ్యాంక్లో ఇజ్రాయెల్ బలగాలు జరిపిన ప్రతిదాడిలో మృతి చెందిన పాలస్తీనీయుల సంఖ్య పదికి చేరింది. ఓ సైనికుడిని కత్తితో పొడిచేందుకు యత్నించిన తర్వాత పాలస్తీనా పౌరుడు ఒకరు చనిపోయారని ఇజ్రాయెల్ సైనికాధికారులు తెలిపారు
జెరూసలేం, మే 14: వెస్ట్ బ్యాంక్లో ఇజ్రాయెల్ బలగాలు జరిపిన ప్రతిదాడిలో మృతి చెందిన పాలస్తీనీయుల సంఖ్య పదికి చేరింది. ఓ సైనికుడిని కత్తితో పొడిచేందుకు యత్నించిన తర్వాత పాలస్తీనా పౌరుడు ఒకరు చనిపోయారని ఇజ్రాయెల్ సైనికాధికారులు తెలిపారు. ఈ మరణాన్ని పాలస్తీనా ఆరోగ్యాధికారులు ధ్రువీకరించారు. అంతకుముందు ఆక్రమిత వెస్ట్ బ్యాంక్లో ఇజ్రాయెల్ సైనికులు జరిపిన ప్రతిదాడిలో కూడా ఆరుగురు పాలస్తీనా పౌరు లు మృతి చెందారని వారు తెలిపారు.