అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య
ABN , First Publish Date - 2021-06-24T05:42:11+05:30 IST
మండలంలోని ఆలమూరు గ్రామానికి చెందిన మధు సుధాకర్ (40) అప్పులబాధ తాళలేక ఆత్మహత్య చేసుకున్నాడు.
పాణ్యం, జూన్ 23: మండలంలోని ఆలమూరు గ్రామానికి చెందిన మధు సుధాకర్ (40) అప్పులబాధ తాళలేక ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం ఉద యం గ్రామ పొలిమేరల్లో చెట్లుకు మధు సుధాకర్ ఉరి వేసుకొని ఉండడం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని నంద్యాల ప్రభుత్వాసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతు నికి భార్య సుహాసిని, ఇద్దరు కూతుర్లు ఉన్నట్లు తెలిపారు. మధు సుధాకర్ ఇటీవల కూతురుకు పెళ్లి చేశాడన్నారు. పాణ్యం డొంగు వద్ద హోటల్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నట్లు తెలిపారు. రెండునెలలుగా హోటల్ జరగక అప్పులు పెరిగి తీవ్ర మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిసింది. సహాసిని ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పాణ్యం ఎస్హెచ్ఓ లింగమయ్య తెలిపారు.