అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య
ABN , First Publish Date - 2022-06-21T05:29:17+05:30 IST
అప్పుల బాధతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ మండలం కంటోనిపల్లిలో సోమవారం చోటు చేసుకుంది.
వెల్దండ, జూలై 20 : అప్పుల బాధతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ మండలం కంటోనిపల్లిలో సోమవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన తోట శేఖర్ (48) వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఇటీవల తనకు అప్పులు పెరిగాయని సన్నిహితులకు చెప్పి ఆవేదన వ్యక్తం చేసేవాడు. ఈ క్రమంలో తీవ్ర మనస్తాపం చెంది వ్యవసాయ పొలం వద్దకు వెళ్లి చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రి ఇంటికి రాకపోవడంతో కుమారుడు పొలం వద్దకు వెళ్లి చూడగా అప్పటికే మృతిచెందాడు. మృతుడికి భార్య లక్ష్మమ్మ, ముగ్గురు పిల్లలు ఉన్నారు. భార్య లక్ష్మమ్మ ఫిర్యాదుతో పోలీసులు కేసునమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్టుమార్డం నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.