సంక్షేమ పఽథకాల కోసమే అప్పులు
ABN , First Publish Date - 2021-10-14T05:04:07+05:30 IST
సంక్షేమ పథకాలకోసమే ప్రభుత్వం అప్పులు చేస్తోందని స్పీకర్ తమ్మినేని సీతారాం తెలిపారు.
స్పీకర్ తమ్మినేని సీతారాం
పొందూరు: సంక్షేమ పథకాలకోసమే ప్రభుత్వం అప్పులు చేస్తోందని స్పీకర్ తమ్మినేని సీతారాం తెలిపారు. బుధవారం పొందూరులో ఆసరా చెక్కు ల పంపిణీతో పాటు ఎంపీపీ ఎన్నికల విజయోత్సవ కార్యక్రమం నిర్వహించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు ప్రభుత్వం ఇచ్చిన ఇళ్లప ట్టాలపై కోర్టుకు వెళ్లి అడ్డుకొని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నీచరాజ కీయం చేస్తున్నారని విమర్శించారు. పఽథకాలకు జగనన్నపేరు పెడితే తప్పేం టని, టీడీపీ హయాంలో చంద్రన్న బీమా, చంద్రన్న తోఫా చంద్రన్న ఈక తోక అంటూ పేర్లు పెట్టలేదా?అని ప్రశ్నించారు. నియోజకవర్గంలో నాయకులు, కార్యకర్తలు తన తనయుడు చిరంజీవినాగ్ను కాబోయే ఎమ్మెల్యే అంటూ నినాదాలు చేస్తున్నారని, ఏ విషయమైనా అధిష్టానానిదే తుది నిర్ణయమని తెలిపారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ శాంతిశ్రీ, వైసీపీ నాయకులు చి రంజీవినాగ్, ఎంపీపీ కిల్లి ఉషారాణి, జడ్పీటీసీ ఎల్. కాంతారావు పాల్గొన్నారు.