ఓటీఎస్‌తో పేదలను వంచిస్తోంది

ABN , First Publish Date - 2021-12-09T04:52:37+05:30 IST

నిరుపేదలు నివసించేందుకు గత ప్రభుత్వాలు మంజూరు చేసిన పక్కా ఇళ్లకు ప్రస్తుతం సంపూ ర్ణ హక్కు కల్పిస్తామని ఓటీఎస్‌ పేరుతో రూ.10 వేలు వసూలు చేసి పేదలను ప్రభుత్వం వంచిస్తోందని మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ఆరోపించారు.

ఓటీఎస్‌తో  పేదలను వంచిస్తోంది
గౌరవ సభలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి

 మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి

సారవకోట (జలుమూరు): నిరుపేదలు నివసించేందుకు గత ప్రభుత్వాలు మంజూరు చేసిన  పక్కా ఇళ్లకు ప్రస్తుతం సంపూ ర్ణ హక్కు కల్పిస్తామని ఓటీఎస్‌ పేరుతో రూ.10 వేలు వసూలు చేసి పేదలను ప్రభుత్వం వంచిస్తోందని మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ఆరోపించారు. బుధవారం లంబ గ్రామంలో గౌరవ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇంటి పన్ను కట్టి, మీటర్లు అమర్చుకుని శాశ్వతంగా ఉంటున్న ఇళ్లకు ఇప్పుడు నగదు వసూలు చేయడం దారుణమన్నారు.  జవాద్‌ తుఫాన్‌తో అన్నదాతలు అల్లాడుతుంటే ప్రభుత్వానికి చీమకుట్టినట్లయినా లేదన్నారు. తడిచిన, రంగుమారిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో పార్టీ  మండల అధ్యక్షుడు కత్తిరి వెంకటరమణ, సురవరపు తిరుపతిరావు,  నాగరాజు పాల్గొన్నారు. 

  

Updated Date - 2021-12-09T04:52:37+05:30 IST