స్కూళ్లు, కాలేజీల ప్రారంభంపై 14న చెబుతాం: కేంద్రం

ABN , First Publish Date - 2020-04-05T21:44:01+05:30 IST

విద్యాసంస్థల పునఃప్రారంభంపై ఏ విషయమూ ఈ నెల 14న చెబుతామని కేంద్ర మానవ

స్కూళ్లు, కాలేజీల ప్రారంభంపై 14న చెబుతాం: కేంద్రం

న్యూఢిల్లీ: విద్యాసంస్థల పునఃప్రారంభంపై ఏ విషయమూ ఈ నెల 14న చెబుతామని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ తెలిపారు. 14న లాక్‌డౌన్ ఎత్తివేసిన తర్వాత దేశంలోని కరోనా వైరస్ పరిస్థితిపై సమీక్ష నిర్వహించిన అనంతరం ఈ విషయంలో నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిపారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల భద్రతే తమకు అత్యంత ప్రధానమైన విషయమని పోఖ్రియాల్ స్పష్టం చేశారు. ఏప్రిల్ 14 తర్వాత కూడా విద్యాసంస్థల మూత కొనసాగినా విద్యార్థులను నష్టపోనివ్వమని హామీ ఇచ్చారు. లాక్‌డౌన్ ఎత్తివేత తర్వాత మిగిలిన పరీక్షలతోపాటు ఎవాల్యుయేషన్ కొనసాగించే యోచనలో ఉన్నట్టు మంత్రి వివరించారు.  

Updated Date - 2020-04-05T21:44:01+05:30 IST