కరువు జిల్లాగా ప్రకటించండి
ABN , First Publish Date - 2020-09-22T08:58:36+05:30 IST
శ్రీకాకుళాన్ని కరువు జిల్లాగా ప్రకటించాలని పలాస తహసీల్దార్ కార్యాలయం ఎదుట వామపక్షాల ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు.
పలాస రూరల్,సెప్టెంబరు 21: శ్రీకాకుళాన్ని కరువు జిల్లాగా ప్రకటించాలని పలాస తహసీల్దార్ కార్యాలయం ఎదుట వామపక్షాల ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తితలీ నష్టపరిహారం రైతుల ఖాతాలో జయచేయా లని, జీడి పంటకు అదనంగా రూ.1000 చెల్లించాలని, రైతుల ఉచిత విద్యు త్ను నీరుగార్చే జీవో 22ను రద్దు చేయాలని కోరారు.
అనంతరం సమస్య లతో కూడిన వినతిపత్రం డీటీ పాపారావుకు అందజేశారు. కార్య క్రమంలో సీపీఐ నాయకులు చాపర వేణుగోపాల్, సీహెచ్ వెంకట రమణ, సీపీ ఐఎంఎల్ లిబరేషన్, న్యూడెమోక్రసీ నాయకులు పాల్గొన్నారు.
రైతులను ఆదుకోవాలి
టెక్కలి డివిజన్ను కరువు ప్రాంతంగా ప్రకటించి రైతులను ఆదుకో వా లని ప్రజా సంఘాల ఐక్యవేదిక సభ్యులు తహసీల్దార్ ఎన్.మధుసూదన రావుకు సోమవారం వినతిపత్రం అందించారు. డివిజన్లోని ఇచ్ఛాపురం, పలాస, టెక్కలి నియోజకవర్గాల్లో వరి పంటలు ఎండిపోయాయని తెలి పారు.
కార్యక్రమంలో ప్రజాసంఘాల ఐక్య వేదిక కన్వీనర్ పుచ్చ దుర్యో ధన, కోకన్వీనర్ అరుణ, ప్రజా కళామండలి, ప్రగతిశీల కార్మిక సంఘ నాయకులు కె.నీలకంఠం, కె.పురుషోత్తం పాల్గొన్నారు.