టీమిండియాకు అలాంటి ట్రిక్కులు తెలియవు: దీప్ దాస్ గుప్తా

ABN , First Publish Date - 2021-05-14T17:25:12+05:30 IST

టీమిండియా మైండ్‌గేమ్స్ ఆడడం, ప్రత్యర్థి టీమ్‌లను పక్కదాటి పట్టించడం తానెప్పుడూ చూడలేదని మాజీ క్రికెటర్ దీప్ దాస్ గుప్తా అన్నాడు.

టీమిండియాకు అలాంటి ట్రిక్కులు తెలియవు: దీప్ దాస్ గుప్తా

టీమిండియా మైండ్‌గేమ్స్ ఆడడం, ప్రత్యర్థి టీమ్‌లను పక్కదాటి పట్టించడం తానెప్పుడూ చూడలేదని మాజీ క్రికెటర్ దీప్ దాస్ గుప్తా అన్నాడు. టీమిండియా తమను పక్కదారి పట్టించి సిరీస్ గెలిచిందన్న ఆస్ట్రేలియా టెస్ట్ కెప్టెన్ టిమ్ పైన్ వ్యాఖ్యలు తనకు విస్మయం కలిగించాయన్నాడు. భారత్ చేతిలో 2-1తో సిరీస్ ఓడిపోవడం ఆసీస్ స్వయంకృతాపరాధమేనన్నాడు. 


`ఆ సిరీస్‌లో టీమిండియా ఉద్దేశపూర్వకంగా ఏమీ చేయలేదు. క్వారంటైన్ అంశంలో నిజాయితీ ఉంది కదా. ఓటమి పాలైన ఇన్ని నెలల తర్వాత పైన్ ఏదో సాకు చెబుతున్నాడు. నిజానికి ఆ సరీస్ ఓటమి ఆసీస్ టీమ్ స్వయంకృతాపరాధమే. 30 ఏళ్ల తర్వాత గబ్బాలో ఓడిపోయారు. టీమిండియా మైండ్ గేమ్స్ ఆడడం, ప్రత్యర్థి టీమ్‌ను పక్కదారి పట్టించడం నేనెప్పుడూ చూడలేద`ని దీప్ దాస్ అన్నాడు. 

Updated Date - 2021-05-14T17:25:12+05:30 IST