సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ అల్లర్ల ఘటనలో దర్యాప్తు ముమ్మరం

ABN , First Publish Date - 2022-06-19T15:13:37+05:30 IST

Hyderabad: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ అల్లర్ల ఘటనలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే 52 మంది విద్యార్థులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మరో

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ అల్లర్ల ఘటనలో దర్యాప్తు ముమ్మరం

Hyderabad: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ అల్లర్ల ఘటనలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే 52 మంది విద్యార్థులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మరో ఏడుగురు అనుమానితులను రైల్వే పొలీసులు విచారిస్తున్నారు.  సీసీ కెమెరా, పోలీస్ వీడియో రికార్డింగ్, మీడియా ఫుటేజ్, సోషల్ మీడియా, సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా మరికొంత మంది అభ్యర్థులను గుర్తించే పనిలో పోలీసులున్నారు. అల్లర్ల వెనక ఉన్న ప్రైవేటు డిఫెన్స్ అకాడమీ యాజమాన్యాల కుట్ర ఉందని కోణంలో పోలీసుల విచారణ జరుగుతోంది. ఇప్పటికే కీలక నిందితుడు ఆవుల సుబ్బారావు‌ను అరెస్టు చేశారు.  

Updated Date - 2022-06-19T15:13:37+05:30 IST