పాడుబడిన బావిలో జింక కళేబరం

ABN , First Publish Date - 2021-01-17T05:46:28+05:30 IST

పాడుబడిన బావిలో జింక కళేబరం

పాడుబడిన బావిలో జింక కళేబరం
బావిలోపడి మరణించిన జింక

  • ఘటనా స్థలాన్ని పరిశీలించిన అధికారులు

యాచారం: భాషమోనిగూడలో పాడుబడిన వ్యవసాయ బావిలో జింక కళేబరాన్ని అటవీశాఖ అధికారులు గుర్తించారు. శనివారం ఉదయం గ్రామంలో పాండయ్యకు చెందిన  బావికి సమీపంలో మోటార్‌ను పెట్టడానికి రైతులు వెళ్లగా దుర్వాసన వచ్చింది. గమనించి బావిలోకి చూడగా జింక మృతి చెందింది. దీంతో అటవీ అధికారులకు సమాచారం అందించారు. కందుకూరు అటవీశాఖ సెక్షన్‌ అధికారి నర్సింహ సిబ్బందితో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కుర్మిద్ద్ద, తాడిపర్తి అడవుల నుంచి జింక తప్పి పోయి వచ్చి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. కుక్కలు తరమడంతో బెదిరిపోయి ప్రమాదవశాత్తు బావిలో పడి మత్యువాత పడి ఉంటుందని నర్సింహ వివరించారు. 

Updated Date - 2021-01-17T05:46:28+05:30 IST