జింకలు ప్రత్యక్షం.. అంతలోనే మాయం
ABN , First Publish Date - 2020-04-03T10:12:42+05:30 IST
బుచ్చిరెడ్డిపాళెం వెలుగు కార్యాలయం ఎదురుగా ఉన్న మలిదేవి కాలువలో గురువారం ఓ జింక, రెండు జింక పిల్లలు ప్రత్యక్షమయ్యాయి.
బుచ్చిరెడ్డిపాళెం, ఏప్రిల్2 : బుచ్చిరెడ్డిపాళెం వెలుగు కార్యాలయం ఎదురుగా ఉన్న మలిదేవి కాలువలో గురువారం ఓ జింక, రెండు జింక పిల్లలు ప్రత్యక్షమయ్యాయి. వాటిని చూసిన స్థానికులు కొందరు తహసీల్దారు, పోలీసు అధికారుల ద్వారా అటవీశాఖ అధికారులకు సమాచారమిచ్చారు. వారొచ్చి మలిదేవి కాలువలో వెతికారు. కీకారణ్యంలా ఉన్న కాలువలో ఆ జింకలు ఎక్కడో దాక్కోవడంతో కనిపించలేదు. దాంతో అధికారులు చేసేది లేక వెనుదిరిగారు. మినగల్లు, పంచేడు పొలాల్లో నుంచి సదరన్ ఛానల్ మీదుగా మలిదేవి కాలువలోకి వచ్చి ఉంటాయని పలువురు భావిస్తున్నారు. వారం క్రితం చెల్లాయపాళెంలోని ఓ సాగునీటి కాలువలో కూడా ఓ చుక్కల దుప్పిని గుర్తించిన స్థానిక యువకులు అటవీశాఖ అధికారులకు అప్పగించారు.