మతోన్మాద బీజేపీని ఓడించాలి : పల్లా వెంకట్‌రెడ్డి

ABN , First Publish Date - 2022-01-22T05:58:31+05:30 IST

ప్రజాస్వామ్య శక్తుల ఐక్యత తో మతోన్మాద బీజేపీని ఓడించాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యద ర్శి పల్లా వెంకట్‌రెడ్డి పిలుపునిచ్చారు.

మతోన్మాద బీజేపీని ఓడించాలి : పల్లా వెంకట్‌రెడ్డి
కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతున్న పల్లా వెంకట్‌రెడ్డి

నల్లగొండ రూరల్‌, జనవరి 21: ప్రజాస్వామ్య శక్తుల ఐక్యత తో మతోన్మాద బీజేపీని ఓడించాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యద ర్శి పల్లా వెంకట్‌రెడ్డి పిలుపునిచ్చారు. పట్టణంలోని మగ్దూం భవ నలో శుక్రవారం జరిగిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలో నరేంద్రమోదీ ప్రభుత్వం ప్రభుత్వరంగ సంస్థలను,  ప్రై వేటీకరణ చేస్తూ ప్రెటోల్‌ డీజిల్‌ ధరలను పెంచుతూ ప్రజలపై ఆ ర్థిక భారం మోపుతుందని అన్నారు. దీంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేక త వచ్చిందని, 5 రాష్ట్రాల్లో జరగబోయే ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయమని అన్నారు. రాష్ట్రంలో కేసీఆర్‌ ప్రభుత్వం తీసుకువచ్చిన 317 జీవో కారణంగా ఉద్యోగ, ఉపాధ్యాయుల బదిలీల్లో అనేక సమస్యలు తలెత్తాయని అన్నారు. ప్రభుత్వం తీసుక వచ్చిన జీఓను సవరించాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి సత్యం మాట్లాడుతూ ఇటీవల కురిసిన అ కాల వర్షాలకు పంట దెబ్బతిన్న రైతులను ఆదుకోవాలని డి మాండ్‌ చేశారు.  ధా న్యం కొనుగోలు చేసి న డబ్బులను వెంట నే రైతుల ఖాతాల్లో జమ చేయాలని అన్నారు. జిల్లా కార్యవర్గ సభ్యుడు మందడి నర్సింహారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లా కార్యవర్గ సభ్యులు పల్లా నర్సింహారెడ్డి, శ్రవణ్‌కుమార్‌, దేవేందర్‌రెడ్డి, వెంకటరమణ, వెనటేశ్వర్లు, వీరస్వామి పాల్గొన్నారు. 


Updated Date - 2022-01-22T05:58:31+05:30 IST