మరో 8 డీఆర్డీఓ టెక్నాలజీ సెంటర్లు: రక్షణ మంత్రి
ABN , First Publish Date - 2020-09-20T08:11:33+05:30 IST
భవిష్యత్ మిలటరీ అప్లికేషన్లపై పరిశోధనలు చేపట్టడం కోసం రక్షణ పరిశోధనా, అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ) దేశవ్యాప్తం గా ఎనిమిది అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లను ఏర్పాటు చేసినట్టు కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీపాద్ నాయక్ శనివారం రాజ్యసభలో వెల్లడించారు...
న్యూఢిల్లీ, సెప్టెంబరు 19: భవిష్యత్ మిలటరీ అప్లికేషన్లపై పరిశోధనలు చేపట్టడం కోసం రక్షణ పరిశోధనా, అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ) దేశవ్యాప్తం గా ఎనిమిది అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లను ఏర్పాటు చేసినట్టు కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీపాద్ నాయక్ శనివారం రాజ్యసభలో వెల్లడించారు. మిలటరీ వినియోగానికి అవసరమైన కొత్త టెక్నాలజీపై పరిశోధన చేపట్టే విధంగా విద్యా సంస్థలకు ఈ సెంటర్లు సహకారం అందిస్తాయని చెప్పారు.