హత్య కేసులో నిందితుడి అరెస్ట్
ABN , First Publish Date - 2021-08-13T00:18:24+05:30 IST
జిల్లాలో సంచలనం సృష్టించిన హత్య కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు
సంగారెడ్డి: జిల్లాలో సంచలనం సృష్టించిన హత్య కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ బాలాజీ వెల్లడించారు. పుల్కల్ మండలం పెద్దరెడ్డిపేట గ్రామంలో మహబూబ్ అలీ అనే వ్యక్తిని కొత్తపేట శంకర్ కర్రతో బాది హత్యచేసాడు. ఎట్టకేలకు నిందితుడు కొత్తపేట శంకర్ను పోలీసులు అరెస్టు చేసారు. జోగిపేట పొలీస్స్టేషన్లో ప్రెస్మీట్లో కేసు వివరాలను డీఎస్పీ బాలాజీ వెల్లడించారు.