హైదరాబాద్‌లోని ఓ ఏరియా ఆస్పత్రిలో టెస్టుల నిర్వహణలో లోపాలు

ABN , First Publish Date - 2020-07-08T19:53:10+05:30 IST

కొండాపూర్ ఏరియా ఆస్పత్రిలో టెస్టుల నిర్వహణలో లోపాలు బయటపడ్డాయి.

హైదరాబాద్‌లోని ఓ ఏరియా ఆస్పత్రిలో టెస్టుల నిర్వహణలో లోపాలు

 హైదరాబాద్‌: కొండాపూర్ ఏరియా ఆస్పత్రిలో టెస్టుల నిర్వహణలో లోపాలు బయటపడ్డాయి. ఆరు రోజులు అవుతున్నా కరోనా ఫలితాలు రాకపోవడంపై ఆందోళన మొదలైంది. శాంపిల్స్ గాంధీ ఆస్పత్రికి వెళ్లాయని కొందరు, నిమ్స్ ఆస్పత్రికి వెళ్లాయని మరికొందరు అధికారులు చెబుతున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 50 వేలకుపైగా పరీక్షలు చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. తర్వాత కేంద్ర బృందం వచ్చిన తర్వాత దాన్ని లక్షకుపైగా చేస్తామని చెబుతున్నప్పటికీ.. ఆయా ఆస్పత్రులు టెస్టుల కోసం శాంపిల్స్ తీసుకుంటున్నా.. సకాలంలో రిపోర్టులు రాకపోవడంతో బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొండాపూర్ ఏరియా ఆస్పత్రిలో రోజుకు వందకుపైగా టెస్టులు చేస్తున్నారు. ఒక్కోరోజు 200 కూడా టెస్టులు చేస్తారు. కాగా ఈనెల 3న చేసిన టెస్టుల ఫలితాలు బుధవారం నాటికి కూడా రాలేదు. దీంతో బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2020-07-08T19:53:10+05:30 IST