దళితులను కించపరిచేలా మాట్లాడితే ఊరుకోం

ABN , First Publish Date - 2021-07-30T04:33:37+05:30 IST

దళితులను కించపరిచేలా మాట్లాడితే ఊరుకోం

దళితులను కించపరిచేలా మాట్లాడితే ఊరుకోం
సమావేశంలో మాట్లాడుతున్న చేవేళ్ల ఎమ్మెల్యే యాదయ్య

శంకర్‌పల్లి: దళితులను కించపరిచే విధంగా మాట్లాడితే ఊరుకునేది లేదని, తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందని చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య హెచ్చరించారు. గురువారంలో శంకర్‌పల్లిలో టీఆర్‌ఎస్‌ నాయకులు ఈటల రాజేందర్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు. అతిథి గృహంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఈటల బావమరిది మధుసూదన్‌రెడ్డి వాట్సాప్‌ పోస్టులో దళితులను కించపరిచే విధంగా సందేశాలు పంపడం హేయం అన్నారు. హజూరాబాద్‌ ఉప ఎన్నికలో దళితులు సత్తా చూపిస్తారన్నారు. ఎంపీపీ గోవర్ధన్‌రెడ్డి, గుడి మల్కాపూర్‌ మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ వెంకట్‌రెడ్డి, ఎంపీటీసీ యాదగిరి, గోపాల్‌రెడ్డి, ప్రవీణ్‌కుమార్‌, కావలి గోపాల్‌, వాసుదేవ్‌ కన్నా, గోవర్ధన్‌రెడ్డి, చంద్రయ్య పాల్గొన్నారు.


  • మధుసూదన్‌రెడ్డిని అరెస్టు చేయాలి


చేవెళ్ల: దళితులను కించపర్చిన మధుసూదన్‌రెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని చేవెళ్ల ఏఎంసీ చైర్‌పర్సన్‌ మద్దెల శివలీల, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు ప్రభాకర్‌, రమణారెడ్డి అన్నారు. హైవేపై మధుసూదన్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. సర్పంచ్‌లు శివారెడ్డి, శ్రీనివాస్‌, ఎంపీటీసీ రవీందర్‌రెడ్డి, నాయకులు ఎర్ర మల్లేశ్‌, బి.నర్సింలు, చింటూ, మాధవ్‌గౌడ్‌, ఎం.నరేందర్‌గౌడ్‌, మోసిన్‌, విఠలయ్య పాల్గొన్నారు.

Updated Date - 2021-07-30T04:33:37+05:30 IST