డిగ్రీ, పీజీ పరీక్షలు రద్దు చేయాలి
ABN , First Publish Date - 2020-07-14T09:53:27+05:30 IST
డిగ్రీ, పీజీ పరీక్షలపై యూజీసీ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర సహాయ ..
మచిలీపట్నం టౌన్ : డిగ్రీ, పీజీ పరీక్షలపై యూజీసీ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కె. ప్రసన్న కుమార్ డిమాండ్ చేశారు. పరీక్షలు రద్దు చేయాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కృష్ణా యూని వర్శిటీ వద్ద ధర్నా నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు కోట బాబు, తూర్పుకృష్ణా అధ్యక్షుడు కె. పవన్, విజయవాడ సిటీ కార్యదర్శి సి.హెచ్. సుమంత్ పాల్గొన్నారు.