డిగ్రీ కళాశాల అధ్యాపకుడు ఆత్మహత్య
ABN , First Publish Date - 2021-05-14T05:14:14+05:30 IST
స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల్లో హిస్టరీ అధ్యాపకుడు దిమిలి అప్పారావు గురువారం బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు.
మానసిక ఒత్తిడే కారణమంటున్న కుటుంబ సభ్యులు
పాడేరురూరల్, మే 13: స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల్లో హిస్టరీ అధ్యాపకుడు దిమిలి అప్పారావు గురువారం బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. పట్టణంలోని సుండ్రుపుట్టులో నివాసం ఉంటున్న అప్పారావు ఇటీవల పక్షవాతం రావడంతో విశాఖపట్నంలోని వైద్యసేవలు పొంది కోలుకొని నెలరోజుల క్రితం ఇంటికి చేరుకున్నారు. ఆరోగ్యం కుదుటపడిందని కుటుంబ సభ్యులు ఆనందంగా ఉన్నారు. ఇటువంటి సమయంలో గురువారం ఉదయం నాలుగు గంటల సమయంలో మూత్రవిసర్జనకు వెళ్తానని అక్కతో చెప్పి బయటకు వెళ్లిన అప్పారావు ఎంపీడీవో కార్యాలయ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. బయటకు వెళ్లి ఎంత సేపటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతుకుతున్న సమయంలో బావి వద్ద షర్టు, సెల్ఫోన్ కనిపించడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే ఎస్ఐ ఎం.శ్రీనివాస్, సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని బావిలో గాలించగా మృతదేహం లభ్యమైంది. పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. అప్పారావు మృతిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు.