డిగ్రీ ఆన్లైన్ అడ్మిషన్లు ప్రారంభం
ABN , First Publish Date - 2021-09-19T04:21:10+05:30 IST
పట్టణం లోని విశ్వోదయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2021-22 విద్యా సంవత్సరానికి ఆన్లైన్ అడ్మిషన్లు ప్రారంభ మయ్యాయని విశ్వోదయ ప్రభుత్వ ప్రిన్సిపాల్ అరుణ్కుమార్ శనివారం తెలిపారు
వెంకటగిరి(టౌన్), సెప్టెంబరు 18: పట్టణం లోని విశ్వోదయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2021-22 విద్యా సంవత్సరానికి ఆన్లైన్ అడ్మిషన్లు ప్రారంభ మయ్యాయని విశ్వోదయ ప్రభుత్వ ప్రిన్సిపాల్ అరుణ్కుమార్ శనివారం తెలిపారు. అర్హులైనవారు 22వ తేదీ లోపు ఆన్లైన్లో వివరాలు నమోదు చేసు కోవాలని కోరారు. కళాశాలలో ఉన్నత విద్యార్హతలు, బోధనానుభవం గల అధ్యాపకులు ఉన్నారన్నారు. బీఎస్సీ(కంప్యూటర్స్), బీఎస్సీ(బీజడ్సీ), బీవీవోసీ (ఎం సీటీ), బీ.కాం(కంప్యూటర్స్), బీ.ఏ(హెచ్.ఈ.పీ) కోర్సులు ఉన్నాయని తెలిపారు. బైసీపీ విద్యార్ధులు బీవీవోసీ, మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ, బీ.జడ్సీలో అడ్మిషన్ పొందేందుకు అర్హులన్నారు. ఎన్సీసీ సౌకర్యం ఉందని తెలిపారు.