రేపటి నుంచి డిగ్రీ మూడు, ఐదో సెమిస్టర్‌ పరీక్షలు

ABN , First Publish Date - 2021-04-11T07:03:31+05:30 IST

ఎస్వీయూనివర్సిటీ పరిధిలో డిగ్రీ మూడు, ఐదో సెమిస్టర్‌ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి.

రేపటి నుంచి డిగ్రీ మూడు, ఐదో సెమిస్టర్‌ పరీక్షలు

70 కేంద్రాలకు హాజరు కానున్న 35వేల మంది విద్యార్థులు

తిరుపతి (విశ్వవిద్యాలయాలు), ఏప్రిల్‌ 10: ఎస్వీయూనివర్సిటీ పరిధిలో డిగ్రీ మూడు, ఐదో సెమిస్టర్‌ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. జిల్లా వ్యాప్తంగా 70 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా, సుమారు 35వేల మంది విద్యార్థులు హాజరు కానున్నారు. ఈ పరీక్షలను జంబ్లింగ్‌ విధానంలో నిర్వహించనున్నారు. వేసవితోపాటు కొవిడ్‌ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని పటిష్ఠ ఏర్పాట్లు చేసినట్లు వర్సిటీ సీఈ దామ్లా నాయక్‌ తెలిపారు. వచ్చేనెల మూడో తేదీవరకు జరిగే ఈ పరీక్షలు జరుగుతాయన్నారు. ప్రశ్నపత్రాల సరఫరాకు 20 ప్రభుత్వ కాలేజీలను ఎంపిక చేశామన్నారు. మూడు సిట్టింగ్‌, మూడు హైపవర్‌ స్క్వాడ్‌ల ద్వారా పర్యవేక్షణ ఉంటుందన్నారు. విద్యార్థులు తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలని సూచించారు. 

Updated Date - 2021-04-11T07:03:31+05:30 IST