ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు అడేష్ గుప్తాకు కరోనా

ABN , First Publish Date - 2020-09-16T23:35:37+05:30 IST

ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు అడేష్ గుప్తాకు కరోనా

ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు అడేష్ గుప్తాకు కరోనా

న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ రోజురోజుకూ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు అడేష్ గుప్తా కరోనా వైరస్ పాజిటివ్ వచ్చినట్లు వైద్య అధికారులు వెల్లడించారు. తనకు కోవిడ్ -19 పరీక్షలు చేశారని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు అదేష్ గుప్తా బుధవారం ట్వీట్ చేశారు. గత వారంలో తనకు తేలికపాటి జ్వరం వచ్చిన తరువాత కోవిడ్ -19 పరీక్ష చేయించుకున్నానని చెప్పారు. తాను చేయించుకున్న పరీక్షలో కరోనా పాజిటివ్ వచ్చినట్లు అదేష్ గుప్తా ట్వీట్ చేశారు. తాను గత ఒక వారం రోజుల నుంచి క్వారంటైన్‌లో ఉన్నట్లు గుప్తా తెలిపారు.

Updated Date - 2020-09-16T23:35:37+05:30 IST