ఐపీఎల్: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్
ABN , First Publish Date - 2020-10-21T00:49:06+05:30 IST
ఐపీఎల్లో మరో రసవత్తర పోరుకు దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ మైదానం వేదికగా నిలిచింది. ఐపీఎల్ పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్లో ఉన్న ఢిల్లీ జట్టుతో, గేల్ రాకతో...
దుబాయ్: ఐపీఎల్లో మరో రసవత్తర పోరుకు దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ మైదానం వేదికగా నిలిచింది. ఐపీఎల్ పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్లో ఉన్న ఢిల్లీ జట్టుతో, గేల్ రాకతో జోరుమీదున్న పంజాబ్ జట్టు తలపడబోతోంది. ఈ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఢిల్లీ జట్టులో మూడు మార్పులు చోటుచేసుకున్నాయి. గాయం కారణంగా దూరమైన రిషబ్ పంత్తో పాటు, హెట్మయిర్, డేనియల్ శామ్స్ ఈ మ్యాచ్లో ఆడనున్నారు. ఈ మ్యాచ్లో పంజాబ్ జట్టులో జోర్డాన్ బదులు నీషమ్ ఆడనున్నాడు. ఇప్పటివరకూ జరిగిన 9 మ్యాచ్ల్లో ఏడు మ్యాచ్ల్లో నెగ్గి పాయింట్ల పట్టికలో ఢిల్లీ జట్టు ప్రథమ స్థానంలో ఉండగా, 9 మ్యాచ్ల్లో 3 మ్యాచ్లు గెలిచిన పంజాబ్ ఏడో స్థానంలో ఉంది.
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు: పృథ్వీ షా, శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), రిషబ్ పంత్(వికెట్ కీపర్), హెట్మయిర్, డేనియల్ శామ్స్,స్టోనిస్,అక్సర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, తుషార్ దేశ్పాండే, రబడ
పంజాబ్ జట్టు: కేఎల్ రాహుల్(కెప్టెన్/ వికెట్ కీపర్), మయాంక్ అగర్వాల్, క్రిస్ గేల్, నికోలస్ పూరన్, మ్యాక్స్వెల్, దీపక్ హుడా, జేమ్స్ నీషమ్, మురుగన్ అశ్విన్, మహ్మద్ షమీ, రవి బిష్ణోయ్, అర్ష్దీప్ సింగ్