పంజాబ్పై ఢిల్లీ గెలుపు
ABN , First Publish Date - 2021-04-19T04:50:01+05:30 IST
పంజాబ్ కింగ్స్పై ఢిల్లీ క్యాపిటల్స్ సూపర్ విక్టరీ సాధించింది. శిఖర్ ధవన్(92: 49 బంతుల్లో.. 13 ఫోర్లు, 2 సిక్స్లు) మెరుపు ఇన్నింగ్స్తో..
ముంబై: పంజాబ్ కింగ్స్పై ఢిల్లీ క్యాపిటల్స్ సూపర్ విక్టరీ సాధించింది. శిఖర్ ధవన్(92: 49 బంతుల్లో.. 13 ఫోర్లు, 2 సిక్స్లు) మెరుపు ఇన్నింగ్స్తో పంజాబ్ను చిత్తుగా ఓడించింది. టోర్నీలో రెండో విజయాన్ని నమోదు చేసింది. 196 పరుగుల లక్ష్యాన్ని మరో పది బంతులు మిగిలుండగానే.. 4 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. పంజాబ్ బౌలర్లలో జ్యే రిచర్డ్సన్ 2 వికెట్లు తీయగా, అర్ష్దీప్ సింగ్, రైలీ మెరిడిత్లు చెరో వికెట్ తీశారు. కాగా.. మహ్మద్ షమి తన 4 ఓవర్లలో ఒక్క వికెట్ కూడా తీయకుండా ఏకంగా 13.25 ఎకానమీతో 53 పరుగులు సమర్పించుకున్నాడు. కాగా.. ఈ విజయంతో ఢిల్లీ ఐపీఎల్ పాయింట్ల పట్టికలో టాప్ 2కు చేరింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు శిఖర్ ధవన్కు దక్కింది.