కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని కలిసిన ఉక్కు నిర్వాసితులు

ABN , First Publish Date - 2021-07-23T17:39:12+05:30 IST

కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని విశాఖ ఉక్కు నిర్వాసితులు, బాధితులు శుక్రవారం కలుసుకున్నారు.

కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని కలిసిన ఉక్కు నిర్వాసితులు

న్యూఢిల్లీ: కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని  విశాఖ ఉక్కు నిర్వాసితులు, బాధితులు శుక్రవారం కలుసుకున్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డికు ఉక్కు నిర్వాసితులు, బాధితులు లేఖ ఇచ్చారు. ఉద్యోగ భద్రత కలిపించాలని వారు డిమాండ్  చేస్తున్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌కు భూములు ఇచ్చిన వారికి తిరిగి భూములు కేటాయించాలన్నారు. దాదాపు 18 వేల ఎకరాలు ఖాళీగా ఉన్నాయని... భూమి ఇచ్చిన ప్రతి ఒక్కరి ఎకరం భూమి కేటాయించాలని కోరారు. స్టీల్ ప్లాంట్‌కి భూములు ఇచ్చిన నిర్వాసితులకు ఎకరం భూమి, కానీ కోటి రూపాయలు అందించాలని ఉక్కు నిర్వాసితుల నాయకురాలు ధనలక్ష్మి, గాజువాక బీజేపీ కో కన్వీనర్ కరణం రెడ్డి నర్సింగరావు డిమాండ్ చేశారు. 

Updated Date - 2021-07-23T17:39:12+05:30 IST