వృద్ధురాలిని కారుతో ఢీకొట్టి.. ఆ తరువాత..

ABN , First Publish Date - 2020-07-04T21:57:50+05:30 IST

తాగిన మైకంలో ఉన్న ఓ పోలీస్ ఇన్‌స్పెక్టర్ దారుణానికి పాల్డడ్డాడు. ఓ మహిళను కారుతో ఢొకనడమే కాకుండా..అక్కడి నుంచి తప్పించుకునే క్రమంలో ఆమెపై నుంచి కారును పోనిచ్చేశాడు.

వృద్ధురాలిని కారుతో ఢీకొట్టి.. ఆ తరువాత..

న్యూఢిల్లీ: తాగిన మైకంలో ఉన్న ఓ పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్ దారుణానికి పాల్డడ్డాడు. ఓ మహిళను కారుతో ఢీకొనడమే కాకుండా..అక్కడి నుంచి తప్పించుకునే క్రమంలో ఆమెపై నుంచి కారును పోనిచ్చేశాడు. దీంతో బాధితురాలు తీవ్రగాయాలపాలైంది. న్యూఢిల్లీలోని ఘాజీపూర్ దగ్గర ఓ గ్రామంలో శుక్రవారం ఈ దారుణం జరిగింది. ఘటనకు సంబంధించిన భయానకమైన దృశ్యాలు సీసీ కెమెరాలకు చిక్కాయి. నిందితుడిని యోగేంద్రగా పోలీసులు గుర్తించారు. అతడు ఓ సబ్ ఇన్సెప్టర్ అని తెలిపారు. ఘటన సమయంలో ఆ ఎస్సై తాగిన మైకంలో ఉన్నట్టు స్థానికులు పేర్కొన్నారు. చిన్న సందులోకి కారును తోలి ఓ మహిళను డీకొన్నాడని చెప్పారు. తాము అతడిని ఆపే ప్రయత్నం చేయగా నిందితుడు.. మహిళపై నుంచి కారును పోనిస్తూ తప్పించుకునే ప్రయత్నం చేశాడని తెలిపారు. కాగా.. యోగేంద్రను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిర్లక్ష్యంగా వాహనం నడిపి ప్రాణాపాయ స్థితి కల్పించినందుకు అతడిపై కేసు నమోదు చేశారు. 

Updated Date - 2020-07-04T21:57:50+05:30 IST