సుశీల్ కుమార్ జుడీషియల్ కస్టడీని పొడిగించిన కోర్టు

ABN , First Publish Date - 2021-06-12T00:06:45+05:30 IST

హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ రెజ్లర్ సుశీల్ కుమార్ జుడీషియల్ కస్టడీని ఢిల్లీ కోర్టు ఈ

సుశీల్ కుమార్ జుడీషియల్ కస్టడీని పొడిగించిన కోర్టు

న్యూఢిల్లీ: హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ రెజ్లర్ సుశీల్ కుమార్ జుడీషియల్ కస్టడీని ఢిల్లీ కోర్టు ఈ నెల 25 వరకు పొడిగించింది. మాజీ జూనియర్ నేషనల్ రెజ్లింగ్ చాంపియన్ అయిన సాగర్ ధన్‌కర్ హత్య కేసులో అరోపణలు ఎదుర్కొంటున్న సుశీల్ కుమార్.. తనకు జైలులో ప్రత్యేక సప్లిమెంటరీ డైట్ అందించాలంటూ వేసిన పిటిషన్‌ను కోర్టు ఇటీవల కొట్టివేసింది. చట్టానికి అందరూ సమానమేనని, ప్రత్యేక ఆహారం అందించడం కుదరదని తేల్చిచెప్పింది. 


ఈ కేసులో ఢిల్లీ పోలీస్ క్రైమ్ బ్రాంచ్ అధికారులు నేడు పదో నిందితుడు అనిరుధ్‌ను అరెస్ట్ చేశారు. వృత్తిపరంగా రెజ్లర్ అయిన అనిరుధ్.. సాగర్ రాణా హత్య కేసులో ప్రధాన నిందితుడైన సుశీల్ ఆదేశాల మేరకే సాగర్‌పై దాడిచేసినట్టు అంగీకరించాడు.   

Updated Date - 2021-06-12T00:06:45+05:30 IST